హృదయ విదారకం.. మురికికాలువలో ఆడశిశువు మృతదేహం లభ్యం

మురికి కాలువలో అప్పుడే జన్మించిన ఆడ శిశువు మృతదేహం నిజామాబాద్ నగరంలోని మూడవ రౌండ్ పరిధిలో శనివారం ఉదయం లభ్యమైంది.

Update: 2024-06-22 07:02 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : మురికి కాలువలో అప్పుడే జన్మించిన ఆడ శిశువు మృతదేహం నిజామాబాద్ నగరంలోని మూడవ రౌండ్ పరిధిలో శనివారం ఉదయం లభ్యమైంది. ఘటనపై మూడవ టౌన్ ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాములబస్తీ కాలనీలోని ఓ మురికి కాలువలో శిశువు మృతదేహం కనిపించడంతో స్థానికులు వెంటనే తమకు సమాచారం అందించారని అన్నారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశామన్నారు. బయటకు తీసి చూడగా శిశువు మృతి చెందినట్లు గుర్తించామని అన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించామన్నారు.


Similar News