Harish Rao ‘ఎలాంటి సమస్యలున్నా నాకు చెప్పండి’.. గురుకుల విద్యార్థినులకు పర్సనల్ ఫోన్ నంబర్ ఇచ్చిన హరీష్ రావు

ఇటీవల బీఆర్ఎస్ మాజీ మంత్రులు తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల సౌకర్యాలపై ఫోకస్ చేశారు.

Update: 2024-08-31 09:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బీఆర్ఎస్ మాజీ మంత్రులు తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల సౌకర్యాలపై ఫోకస్ చేశారు. కాంగ్రెస్ వచ్చాక 500 మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని, 38 మంది పిల్లలు చనిపోయారని తాజాగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఒకప్పుడు గురుకులాలంటే దేశానికే ఆదర్శమని కేసీఆర్ పాలనను కొనియాడారు. కానీ ఇప్పుడు విద్యార్థుల కళ్లల్లో నీళ్లు చూడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. అలాగే పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థినులను కలిసిన మాజీ మంత్రి హరీష్ రావు దగ్గరుండి మరీ వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎటువంటి ఇబ్బందులు, సమస్యలున్నా తనకు ఫోన్ చేయమని అన్నారు. అంతేకాకుండా హరీష్ రావు వ్యక్తిగత ఫోన్ నంబరు విద్యార్థులకు ఒక బుక్‌పైన రాసి ఇచ్చారు.


Similar News