అశోక్‌నగర్‌లో గ్రూప్‌-1 అభ్యర్థులపై లాఠీ‌చార్జ్.. ఖండించిన మాజీ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్ లోని అశోక్‌నగర్‌లో గ్రూప్‌-1 అభ్యర్థులు.. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. కాగా వారిపై పోలీసులు లాఠీ‌చార్జ్ చేశారు.

Update: 2024-10-18 14:08 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని అశోక్‌నగర్‌లో గ్రూప్‌-1 అభ్యర్థులు.. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. కాగా వారిపై పోలీసులు లాఠీ‌చార్జ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలో.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గ్రూప్‌-1 అభ్యర్థులను బలవంతంగా వ్యాన్ లోకి ఎక్కించడం, మహిళా అభ్యర్థులను రోడ్లపై ఈడ్చుకెళ్లడం, రోడ్లపై పరిగెత్తించి మరి కొట్టడం కనిపించింది. కాగా ఈ ఘటనపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అశోక్‌నగర్‌లో గ్రూప్‌-1 అభ్యర్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జి తీవ్రంగా ఖండించదగినది అని అన్నారు. అలాగే తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఈ విద్యార్థులపై తెలంగాణ పోలీసులు అనవసర హింసకు పాల్పడ్డారని, నిరసనకారులు తీవ్రవాదులు లేదా గూండాలు కాదు, వారు న్యాయం కోరుతూ గ్రూప్-1 ఆశావాదులని గుర్తు చేశారు. గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీ‌చార్జ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు చేటని, ఇది ప్రజా పాలనకు విరుద్ధంగా ఉందని, కాంగ్రెస్ నేత, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తు రాసుకొచ్చారు.


👉Also Read :  BRS: ఇది ప్రజాపాలననా? రౌడీ రాజ్యమా?.. మాజీమంత్రి హరీష్ రావు ట్వీట్ 


Similar News