Telangana Governor: చెడుపై మంచి సాధించిన విజయమే ‘దసరా’

చెడుపై మంచి సాధించిన విజయమే దసరా పండుగ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) అన్నారు.

Update: 2024-10-11 13:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: చెడుపై మంచి సాధించిన విజయమే దసరా పండుగ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) అన్నారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు మనల్ని ఆనందం, ఉత్సాహన్నిస్తుందన్నారు. ‘సత్యం మాత్రమే విజయం సాధిస్తుంది’ అనేది మన జాతీయ నినాదం అన్నారు. పండుగను జరుపుకునేటప్పుడు, వ్యాధులు, పర్యావరణ ప్రమాదాలతో సహా అన్ని చెడులపై పోరాడటానికి, ఆరోగ్యకరమైన దేశాన్ని సృష్టించడానికి మనం సమిష్టిగా ప్రయత్నించాలన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా దుర్గామాత ఆశీర్వాదించాలని ప్రార్ధించినట్లు తెలిపారు. ప్రజలంతా పండుగను సంతోషంగా జరుకోవాలని ఆకాంక్షించారు. గవర్నర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Similar News