Trial run success : గుడ్ న్యూస్.. ధ్వంసమైన రైల్వే ట్రాక్.. ట్రయల్ రన్ సక్సెస్

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య ధ్వంసమైన రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు వేగవంతంగా జరిగాయి.

Update: 2024-09-03 15:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య ధ్వంసమైన రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు వేగవంతంగా జరిగాయి. వరద దాటికి రెండు రోజుల క్రితం ధ్వంసమైన రైల్వే ట్రాక్.. 36 గంటల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేసి రైల్వే శాఖ రికార్డు సృష్టించింది. దాదాపు రైల్వే శాఖ సిబ్బంది శ్రమించి రెండు రోజుల్లోనే మరమత్తులు పూర్తి చేశారు.

ఈ క్రమంలోనే ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్ద మోరీ వద్ద రైలు పట్టాలపై ట్రయిల్ రన్ విజయవంతం అయింది. రేపటి నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే, కొత్తగా ట్రాక్ నిర్మించడంతో ఆ ప్రాంతంలో రైల్లు నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.


Similar News