HARISH RAO: కొండభీమనపల్లి బీసీ గురుకుల పాఠశాలను సందర్శించిన మాజీ మంత్రులు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు నేడు కొండభీమనపల్లి బీసీ గురుకుల పాఠశాలను సందర్శించారు.

Update: 2024-09-01 07:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు నేడు కొండభీమనపల్లి బీసీ గురుకుల పాఠశాలను సందర్శించారు. దేవరకొండ నియోజకవర్గంలోని కొండభీమనపల్లి బీసీ గురుకుల పాఠశాలలో రాత్రి పూట నిద్రిస్తున్న విద్యార్థులను ఎలుకలు కరవడంపై హరీష్ రావు స్పందించారు. ఎలుకల దాడితో 14 మంది విద్యార్థులు గాయపడడం బాధాకరమని అన్నారు. విద్యార్థులతో మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు ఆర్. రవీంద్ర కుమార్, డా. గాదరి కిశోర్ కుమార్, ఎన్. భాస్కర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు కొండభీమనపల్లి బీసీ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాల వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు.


Similar News