ఉప్పొంగి ప్రవహిస్తోన్న గోదావరి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఎగువన కురుస్తోన్న వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి

Update: 2024-07-21 13:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎగువన కురుస్తోన్న వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి భారీగా పెరిగింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో నీటి మట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగ అప్రమత్తమైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి వరద ప్రవాహం పెరిగిందని తెలిపారు. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశామన్నారు. వరదల వల్ల 15 గ్రామాలు ముంపునకు గురువుతాయని, దీంతో ఆ గ్రామ ప్రజల కోసం పునరావాస కేంద్రాలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. రెండో ప్రమాద హెచ్చరిక దాటితే స్లూయిజ్‌లు లీక్ కాకుండా మోటర్లు రెడీ చేశామని తెలిపారు.


Similar News