అమెరికాలో కాల్పుల మోత.. మరో తెలుగు యువకుడు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత తీవ్ర కలకలం రేపింది.

Update: 2024-06-23 05:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో మరోసారి కాల్పుల మోత తీవ్ర కలకలం రేపింది. ఈ కాల్పుల ఘటనలో ఏపీ బాపట్ల జిల్లాకు చెందిన యువకుడు దాసరి గోపీకృష్ణ మృతి చెందాడు. రెండు రోజుల క్రితం దుండగుల కాల్పుల్లో గోపీకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గోపీకృష్ణ మరణించారు. ఆర్కెన్సాస్‌లోని సూపర్ మార్కెట్‌లో గోపీకృష్ణ పనిచేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఎంఎస్ పూర్తి చేసిన గోపీకృష్ణ పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్లు తెలిసింది. మృతుడు గోపీకృష్ణ స్వస్థలం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలిగా తెలిసింది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.  


Similar News