అశోక్నగర్లో తీవ్ర ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
శనివారం నిరుద్యోగులు అశోక్ నగర్ క్రాస్ రోడ్డు వద్ద మెరుపు ధర్నాకు దిగడం పట్ల పోలీసులు అలర్ట్ అయ్యారు.
దిశ, వెబ్డెస్క్: శనివారం నిరుద్యోగులు అశోక్ నగర్ క్రాస్ రోడ్డు వద్ద మెరుపు ధర్నాకు దిగడం పట్ల పోలీసులు అలర్ట్ అయ్యారు. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో అశోక్ నగర్ లో ఆదివారం భారీగా పోలీసులను మోహరించారు. ఆదివారం ఉదయం నుంచి చిక్కడపల్లిలోని లైబ్రరీ పరిసరాలలో పోలీసులు వాహనాలతో గస్తీ కాస్తున్నారు. ఆందోళనల నేపథ్యంలో అనుమానుతులను ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దీంతో అశోక్ నగర్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.