ఇక సెలవు.. ముగిసిన మాజీ మంత్రి డీఎస్ అంత్యక్రియలు

రాజకీయ కురవృద్ధుడు, ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. నిజామాబాద్ బైపాస్ రోడ్డు సమీపంలోని ఆయన

Update: 2024-06-30 11:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ కురవృద్ధుడు, ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్ అంత్యక్రియలు ముగిశాయి. నిజామాబాద్ బైపాస్ రోడ్డు సమీపంలోని ఆయన ఫాంహౌజ్‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ డీఎస్ అంత్యక్రియలు నిర్వహించారు. డీఎస్‌ను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్నేహితులు పెద్ద ఎత్తున అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆశ్రునయాల నడుము డీఎస్‌కు తుది వీడ్కోలు పలికారు. డీఎస్ అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, శనివారం తెల్లవారుజూమున డీఎస్ గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన డీఎస్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరక అధికారులు అధికారిక లాంఛనాలతో ఆదివారం డీఎస్ అంత్యక్రియలను నిర్వహించారు.


Similar News