తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే.. ఈటల కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.

Update: 2024-06-21 16:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్ గిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్ని్కల్లో 39 శాతం ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 45 శాతం ఓట్లకు చేరిందని కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని.. డబ్బులు పంచి, మద్యం పంచి, అనేక డ్రామాలు వేసినా అధికార పార్టీకి ఓట్ల శాతం పెరగలేదన్నారు. అదే బీజేపీకి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 21 శాతం ఓట్లు పెంచుకుని 35 శాతంతో రేపటి కాలంలో ఈ గడ్డ మీద ఎగిరేది కాషాయ జెండానే అని ఈటల అన్నారు. తద్వారా తెలంగాణలో ప్రజానీకం తన ఆత్మను ఆవిష్కరించుకుంటుందన్నారు.   


Similar News