వేసవి సెలవుల పొడిగింపుపై విద్యాశాఖ క్లారిటీ..

రాష్ట్రంలో ఈనెల 12వ తేదీ నుంచే స్కూళ్లు పున:ప్రారంభం కాబోతున్నాయని విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

Update: 2023-06-09 15:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈనెల 12వ తేదీ నుంచే స్కూళ్లు పున:ప్రారంభం కాబోతున్నాయని విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఎండ తీవ్రత నేపథ్యంలో వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కాగా, దీనిపై స్పందించిన అధికారులు అలాంటి తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచించారు. అకడమిక్ క్యాలెండర్ సైతం వచ్చేసిందని, తొలుత నిర్ణయించిన ప్రకారమే పాఠశాలలు తెరుచుకోనున్నట్లు స్పష్టంచేశారు. ఎండ తీవ్రత నేపథ్యంలో వేసవి సెలవులు పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈనెల 12 నుంచే పాఠశాలలు ప్రారంభమవుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Tags:    

Similar News