అసెంబ్లీలో బడ్జెట్ ​పద్దుల వేళ.. మంత్రులు, సభ్యుల స్పెషల్!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదోరోజు సోమవారం కొనసాగాయి.

Update: 2025-03-24 16:31 GMT
అసెంబ్లీలో బడ్జెట్ ​పద్దుల వేళ.. మంత్రులు, సభ్యుల స్పెషల్!
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదోరోజు సోమవారం కొనసాగాయి. ఈసందర్భంగా ప్రతిపక్ష బీఆర్​ఎస్​సభ్యులు నల్లబ్యాడ్జీలతో సభలోకి వచ్చారు. రెండు లక్షల రుణమాఫి పూర్తి చేయాలి.. మాట తప్పిన కాంగ్రెస్​ప్రభుత్వం.. రుణమాఫీ బూటకం.. కాంగ్రెస్​నాటకం అంటూ నినాదాలు చేశారు. రెండు లక్షల రుణమాఫీపై మాట తిప్పిన కాంగ్రెస్​డౌన్​డౌన్​ అంఉటు నినాదాలు చేశారు.

బీఆర్ఎస్ వాయిదా తీర్మానం..

సభ ప్రారంభం కాగానే రూ. 2 లక్షల సంపూర్ణ రుణమాఫీ కోసం బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. వరంగల్ రైతు డిక్లరేషన్​లో ఇచ్చిన హామీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుతూ చర్చకు బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్​కు వాయిదా తీర్మానం ఇచ్చారు.

పల్లాగారు.. మీరు కూర్చోండి..

కాగా, బడ్జెట్​పద్దుల చర్చాకు స్పీకర్​గడ్డం ప్రసాద్​అవకాశం ఇచ్చారు. సభలో రైతు మాఫీ విషయంలో ప్రతిపక్ష బీఆర్​ఎస్​సభ్యులు వివేకానంద విమర్శలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు కౌంటర్​ఇచ్చారు. ఇదే సమయంలో తుమ్మల మాట్లాడుతుండగా బీఆర్ఎస్​ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కామెంట్​చేశారు. దీంతో రైతు పల్లాగారు రైతు బంధు అధ్యక్షుడిగా రైతు బంధు గురించి నాకు తెలుసు.. మీరు కూర్చోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొన్నంతో కేటీఆర్ ముచ్చట..

అసెంబ్లీ హౌస్​ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్​ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​ముచ్చటించుకున్నారు. సభలో బడ్జెట్​పద్దులపై వాడివేడీగా చర్చా కొనసాగుతున్నది. బీర్ఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యే వివేకానంద ప్రసంగం ముగిశాక రంగారెడ్డి ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతున్నారు..ఈక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్​వద్దకు వచ్చిన కేటీఆర్.. మంత్రి పక్కనే పది నిమిషాలపాటు కూర్చోని ముచ్చటించుకున్నారు. ఇరువురు ముచ్చటించుకోవడం సభలో ఆసక్తి నెలకొన్నది.

శ్రీధర్​బాబుతో.. మల్లారెడ్డి

సభలో చర్చా కొనసాగుతన్న వేళ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబుతో బీఆర్​ఎస్​ఎమ్మెల్యే మల్లారెడ్డి ముచ్చటించారు. మల్లారెడ్డి స్వయంగా శ్రీధర్​బాబు చైర్​వద్దకు వెళ్లి కూర్చోవడం ఆశ్చర్యకరంగా మారింది.

నవ్వులు పూయించిన అక్భరుద్దీన్..

ఎంఐఎం పార్టీ ఫ్లోర్​లీడర్​ అక్భరుద్దీన్ ఓవైసీ సభలో ఫన్నీ స్టోరీ చెప్పారు. ఓవైసీ ఫేకుడు స్టోరీతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. ఆయన చెప్పిన స్టోరీతో సభ్యులంతా నవ్వారు. ‘‘హైదరాబాద్​లో ఫేకులు ఉండేవారు. ఇద్దరు కూడా ఫేకుల్లో పెద్దలు. ఒకసారి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ.. ఒకరికి మించి ఒకరు ఇలాగా గొప్పలు చెప్పుకుంటారు సార్”​ అని స్పీకర్ అక్బరుద్దీన్ ​వ్యాఖ్యనించారు. ‘‘ ఫస్ట్ ఫేకు మా తాత దగ్గర ఉన్న భూమిలో విత్తనం వేసుకుంటూ పోతే.. చివరి విత్తనం వేసే తిరిగి వచ్చే సమయానికి పంట రెఢీ అయి కోతకు వచ్చేస్తుందని చెబుతాడు.. ‘‘సెకండ్​ఫేకు.. మా తాత దగ్గర పేద్ద వెదురు బొంగు ఉండేది.. ఆ బొంగుతో అకాశంలోని చుక్కలను అటు ఇటు జరిపేంతా పేద్దగా ఉండేదని అంటాడు’’.. అంతా పెద్ద బొంగును ఎక్కడ దాచి పెడుతారు అని ఫస్ట్​పేకు అడుగుతాడు.. మీ తాత భూమిలో దాచుతామని సెకండ్ ఫేకు సమాధాం ఇస్తాడని చెప్పడంతో సభలో నవ్వులు విరబూశాయి. పాలకులు ఇచ్చే హామీలు, అవి అమలు తీరు, ప్రజలు అందే ప్రయోజనాలను ఉద్దేశించి అక్బరుద్దీన్​ ఫన్నీ స్టొరీతో సర్కారుపై విమర్శలు చేశారు.


Similar News