Aleti Maheshwar reddy : సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చివేసి డైవర్షన్ పాలిటిక్స్.. బీజేఎల్పీ నేత సంచలన కామెంట్స్

ఒకరిద్దరు సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చివేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-25 11:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఒకరిద్దరు సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చివేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏలేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్రా పేరుతో హై డ్రామా చేస్తున్నారని, మొదట కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే కూల్చివేతలు మొదలైతే మంచిదని హితువు పలికారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైడ్రా కేసు పెట్టినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. నిత్యం ఏదో ఒక సంచలనం చేయడమే సీఎం రేవంత్ పని అని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలు పక్కన పెట్టారని, రుణమాఫీ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే హైడ్రాతో హైప్ ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్‌తో కట్టుకుని నష్టపోయిన వారికి ఎటువంటి హామీ ఇస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కబ్జా అయిన భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ ప్రభుత్వాన్ని ఏలేటి డిమాండ్ చేశారు.


Similar News