బోనాల సందడి షురూ.. గోల్కొండలో గోల్కొండలో భక్తుల మెట్ల పూజలు

గోల్కొండలో భక్తులు మెట్ల పూజలు నిర్వహించారు.

Update: 2024-07-05 10:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : బోనాల పండుగకు హైదరాబాద్ సిద్ధమైంది. ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో గోల్కొండలోని జగదాంబికా, మహంకాళి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ అమావాస్య కావడంతో మెట్లకు బొట్లు పెట్టి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి యేడాది ఆషాఢ మాసం అమావాస్య రోజున అమ్మవారికి స్వాగతం పలికేందుకు మెట్లకు బొట్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఇవాళ మెట్లకు బొట్లు పెట్టేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈనెల 7వ తేదీ నుంచి బోనాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో గోల్కొండ కోటలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

Tags:    

Similar News