రేపు కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకోనున్నారు.

Update: 2024-06-28 08:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకోనున్నారు. కొండగట్టు అంజన్నకు పవన్ కల్యాణ్ మొక్కులు తీర్చుకోనున్నారు. ఎన్నికల ముందు వారాహి వాహనానికి పూజలు చేసిన పవన్ కల్యాణ్ ముడుపులు కట్టారు. ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసారి కొండగట్టు అంజన్న దేవాలయానికి రానున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటి నుంచి బయల్దేరి 11 గంటలకు పవన్ కొండగట్టు చేరుకోనున్నారు. పూజల అనంతరం కొండగట్టు నుంచి 12.30కు ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాక సందర్భంగా కొండగట్టులో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.  


Similar News