యాదగిరిగుట్టపై మహిషాసుర మర్దనిగా దేవి దర్శనం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహస్వామి కొండపై కొలువైన శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దని అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.

Update: 2024-10-11 09:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహస్వామి కొండపై కొలువైన శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దని అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రాతఃకాల పూజ స్థాపితదేవత హవనం, అర్చనలు, పారాయణములు, గాయత్రీ జపములు, లలిత సహస్రనామార్చన, ,మధ్యాహ్న పూజ, నీరాజన, మంత్రపుష్పములు, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను అర్చక పండితులు శాస్త్రయుక్తంగా నిర్వహించారు.

సాయంకాలం శ్రీదేవీ చతుషష్టి ఉపచార పూజ, సహస్రనామార్చన, నీరాజనం, మంత్రపుష్పములు, సువాసినీ పూజలు తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులు ఆయా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Similar News