Danam Nagender: కౌశిక్‌రెడ్డి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టు: దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటమి తథ్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-16 08:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటమి తథ్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ (Hyderabad)‌తో పాటు శివారు ప్రాంతాల్లోని ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలిగించేందుకు తమ ప్రభుత్వం హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection)ను నెలకొల్పిందని అన్నారు. కక్ష సాధింపు కోసం ‘హైడ్రా’ను ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. శేరిలింగం‌పల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (MLA Arekapudi Gandhi)పై ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతూ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి (MLA Koushik Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఇప్పటికైనా కౌశిక్‌రెడ్డి తన నియోజవర్గ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని హితువు పలికారు. రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణ అంటూ చిచ్చురేపుతున్న బీఆర్ఎస్ కుట్రను భగ్నం చేస్తామని అన్నారు. 

Tags:    

Similar News