Congress MLA: కౌశిక్ రెడ్డితో సారీ చెప్పించే బాధ్యత కేటీఆర్‌దే

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌దే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.

Update: 2024-09-14 13:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌దే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మహిళలను కించపరిచిన కౌశిక్ రెడ్డి ఇంటికి కేటీఆర్ ఏ మొహం పెట్టుకొని వెళ్లారని మండిపడ్డారు. అభినందించడానికి వెళ్లారా? అని అడిగారు. వెంటనే కౌశిక్ రెడ్డితో కేటీఆర్ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. అసలు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదని సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్‌ను, కాంగ్రెస్‌ను విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ.. అకాల వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయ్యిందని అనేకమంది నిరాశ్రయులు అయ్యారని.. అలాంటి వరద బాధితులను పరామర్శించని కేటీఆర్.. కౌశిక్‌ను రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ నేతల అరాచకాలను సాగనివ్వబోమని అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే తాట తీస్తామని అన్నారు.


Similar News