‘CM రేవంత్‌కు పబ్లిక్‌గా సారీ చెప్పాలి’

రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్.. కేవలం కేసీఆర్ కుటంబం కోసమే పనిచేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు.

Update: 2024-09-06 10:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్.. కేవలం కేసీఆర్ కుటంబం కోసమే పనిచేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. శుక్రవారం బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడారు.. కేసీఆర్ కేవలం కుటుంబం కోసమే పనిచేశారని అన్నారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని స్వాగతించకుండా.. ఆటంకం కలిగేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అభివృద్ధికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పనిచేస్తోందని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రూ.10 వేల కోట్లు కేటాయించారని అన్నారు. మున్సిపాలిటీల్లో విలీనం అయిన 51 గ్రామాల అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


Similar News