కేటీఆర్‌కు మైండ్ దొబ్బింది.. కాంగ్రెస్ నేత దయాకర్ ఫైర్

కేటీఆర్‌కు మైండ్ దొబ్బిందని, పవర్ పోగానే పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడని టీపీసీసీ స్పోక్స్ పర్సన్ దయాకర్ మండిపడ్డారు.

Update: 2024-06-27 15:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్‌కు మైండ్ దొబ్బిందని, పవర్ పోగానే పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడని టీపీసీసీ స్పోక్స్ పర్సన్ దయాకర్ మండిపడ్డారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులతో రాజకీయం చేయడం తగదని హెచ్చరించారు. పదేళ్లు పవర్‌లో ఉండి, ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను సతాయించారన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వక, ఇచ్చిన వాటిలో లీకులు, వంటివి చేస్తూ నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. గతంలో టీఎస్ పీఎస్సీ తప్పిదాలతో ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లికను కూడా కేటీఆర్ అవమానపరిచాడన్నారు. గ్రూప్ 1 లీకేజీ సమయంలో కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ఉద్యోగాల భర్తీ తప్పకుండా ఉంటాయన్నారు. నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీ సమయంలో ఎలాంటి సమస్యలు లేకుండా పకడ్భందీగా నియామకాలు చేపట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీగా ఉన్నదన్నారు. నిరుద్యోగులను రెచ్చకొడితే ఊరుకోబోమని దయాకర్ హెచ్చరించారు.


Similar News