Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్స్‌కు సీఎం రేవంత్ ఫోన్..

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత్ క్రీడాకారులు పథకాల సాధనకు సిద్దమైయ్యారు. స్టార్ అథ్లెట్స్ కొంత మంది తమ తొలి రౌండ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు.

Update: 2024-07-29 08:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత్ క్రీడాకారులు పథకాల సాధనకు సిద్దమైయ్యారు. స్టార్ అథ్లెట్స్ కొంత మంది తమ తొలి రౌండ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి వారికి విషెస్ తెలియజేశారు.

ఆయా కేటగిరీల తొలి దశల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోన్న తెలంగాణ అథ్లెట్స్ నిఖత్ జరీన్ (బాక్సింగ్), శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), పీవీ సింధు (బ్యాడ్మింటన్) లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అలాగే తన ఈవెంట్ కోసం సిద్ధమవుతోన్న ఇషా సింగ్ (షూటింగ్)కు కూడా సీఎం బెస్ట్ విషెస్ చెప్పారు. వీరంతా తర్వాతి దశల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించి విజయంతో దేశానికి మెడల్స్ సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

Tags:    

Similar News