‘ఇకపై నేనే ఫీల్డ్‌లోకి దిగుతా’.. కలెక్టర్లకు CM రేవంత్ స్వీట్ వార్నింగ్..!

కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సచివాలయంలో రేవంత్ రెడ్డి భేటీ

Update: 2024-07-02 13:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సచివాలయంలో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్లు ఫీల్డ్‌ విజిట్‌ చేయడం మర్చిపోయారని, ఇక నుండి అలా కుదరదని కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇకపై నేను కూడా ఫీల్డ్‌ విజిట్‌ చేయడంతో పాటు, ఆకస్మిక తనిఖీలు చేస్తానని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై ప్రతీ నెలా అన్ని డిపార్ట్‌మెంట్ల సెక్రటరీలతో సమావేశం ఉంటుందని చెప్పారు. వచ్చామా.. వెళ్లామా అన్నట్టు పని చేస్తే కుదరదని హెచ్చరించారు. పని చేసే అధికారులకు నా సహకారం ఉంటుందని తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ, నెల చివర్లో జరగనున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అన్ని శాఖల సెక్రటరీలతో రేవంత్ రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది.

Similar News