CM Revanth Reddy : నేడు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

నేడు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.

Update: 2024-07-03 05:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. సాయంత్రం ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కే.కేశవరావు చేరనున్నారు. అయితే తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మల్లికార్జున ఖర్గే భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం సీఎంతో కలుపుకుని 12 మంది మంత్రులు ఉండగా మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉండగా.. వీటన్నింటిని భర్తీ చేస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. 


Similar News