గవర్నర్ తేనీటి విందుకు సీఎం రేవంత్ రెడ్డి

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

Update: 2024-08-15 15:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నర్ నివాసం రాజ్ భవన్లో తేనీటి విందు కార్యక్రమం 'ఎట్ హోమ్' పేరుతో నిర్వహిస్తారు. ఈ క్రమంలో నేటి ఎట్ హోమ్ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ హాజరవ్వగా.. బీజేపీ నుండి ఎంపీ ఈటెల రాజేందర్, ఎంఎల్ఏ వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. బీఆర్ఎస్ నుండి ఎంఎల్సీ రమణ మాత్రమే హాజరయ్యారు.  


Similar News