కేంద్ర బృందంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి భేటీ

రాష్ట్ర సచివాలయంలో వరద నష్టంపై కేంద్ర బృందంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డిలు భేటీ అయ్యారు.

Update: 2024-09-13 08:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర సచివాలయంలో వరద నష్టంపై కేంద్ర బృందంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డిలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరద నష్టం అంచనాకు జాతీయ విపత్తు నిర్వాహణ సంస్థ అడ్వయిజర్ కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని కేంద్ర బృందం క్షేత్ర స్థాయి పర్యటన పూర్తి చేసుకుని, శుక్రవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి వరద నష్టంపై కేంద్ర బృందంతో చర్చించారు. పంట నష్టం, ఆస్తుల విధ్వంసం వంటి వివరాలను కేంద్ర బృందానికి నివేదించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారిలు ఉన్నారు.


Similar News