CM Revanth: సాయంత్రం హస్తినకు సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధానితో ఆ అంశంపై భేటీ!
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలతో నిత్యం బిజీబిజీగా గడుపుతోన్న సీఎం రేవంత్రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.
దిశ, వెబ్డెస్క్: ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలతో నిత్యం బిజీబిజీగా గడుపుతోన్న సీఎం రేవంత్రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి అపాయింట్ను కూడా సీఎంవో ఫిక్స్ చేసిందని సమాచారం. భేటీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షం సృష్టించిన బీభత్సం, అస్తి, ప్రాణ, పంట నష్టాలపై సీఎం రేవంత్ ప్రధాని మోడీకి సీఎం రేవంత్రెడ్డి సమగ్ర నివేదికను అందజేయనున్నారు. అదేవిధంగా వరద బాధితుల సహాయార్థం కేంద్రం నుంచి నిధులు విడుదల చేసి ఆదుకోవాలని కోరనున్నారు. సీఎంతో పాటు ఢిల్లీకి కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లనున్నారు. అనంతరం వారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్మెంట్ కోరనున్నారు.