నితిన్ గడ్కరీతో సీఎం, మంత్రులు భేటీ.. ఎవరెవరు ఉన్నారంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

Update: 2024-06-26 13:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భేటీ అయ్యారు. రాష్ట్ర రహదారులపై సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు.

తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి హరి చందన, ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.

Tags:    

Similar News