చంద్రబాబును కలిసిన చిరంజీవి.. రూ.1 కోటి చెక్ అందజేత

హైదరాబాద్ జూబ్లిహిల్స్ నివాసంలో చంద్రబాబును చిరంజీవి కలిశారు..

Update: 2024-10-12 13:43 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు(Ap Cm Chandrababu Naidu)ను మెగస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్(Hyderabad Jubilee Hills) నివాసంలో చంద్రబాబును కలిసి కోటి రూపాయల చెక్‌ను అందజేశారు. ఏపీ వరద బాధితుల(AP flood victims) సహాయార్థం సీఎం సహాయ నిధి(CM Relief Fund)కి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్(Hero Ram Charan) తరపున రూ.50 లక్షల విరాళం అందజేశారు. దీంతో చిరంజీవికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ఎప్పుడూ ముందుండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అంతకుముందు విరాళం చెక్కులు అందించేందుకు తన ఇంటికి వచ్చిన చిరంజీవికి సాదర స్వాగతం పలికారు. ఇరువురి భేటీ అనంతరం చిరంజీవి కారు వరకూ చంద్రబాబు వెళ్లి వీడ్కోలు పలికారు.


Similar News