పార్టీ అధ్యక్షుడు మార్పు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీ స్టేట్ చీఫ్ పోస్ట్ ఈటల రాజేందర్ కు ఇవ్వనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్న తరుణంలో కేంద్రమంత్రి, ప్రస్తుత స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-10 03:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీజేపీ స్టేట్ చీఫ్ పోస్ట్ ఈటల రాజేందర్‌కు ఇవ్వనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్న తరుణంలో కేంద్రమంత్రి, ప్రస్తుత స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఛానెల్‌తో ఆయన సోమవారం మాట్లాడుతూ.. పార్టీలో సంస్థాగత మార్పులు ఉంటాయన్నారు. బీజేపీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగుస్తోందని తెలిపారు. జాతీయ అధ్యక్షుడి మార్పు త్వరలో ఉండబోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పులు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

సంస్థాగత మార్పులపై కసరత్తు జరుగుతోందని.. త్వరలో కొత్తవారి నియామకం ఉంటుందని చెప్పారు. అయితే నేడు అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించనున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ సీఎం నినాదం ఎత్తుకోగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఆ మేరకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈటలకు రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


Similar News