తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల వెల్లువ

వరద బాధితులకు సాయం చేసేందుకు ఒక్కొక్కరుగా అందరూ ముందుకు వస్తున్నారు. సినిమా హీరోలతో మొదలైన ఈ విరాళాల ప్రక్రియ.. రాజకీయ, వ్యాపార వేత్తలతో పాటు సామాన్యులు కూడా స్పందిస్తున్నారు.

Update: 2024-09-06 15:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరద బాధితులకు సాయం చేసేందుకు ఒక్కొక్కరుగా అందరూ ముందుకు వస్తున్నారు. సినిమా హీరోలతో మొదలైన ఈ విరాళాల ప్రక్రియ.. రాజకీయ, వ్యాపార వేత్తలతో పాటు సామాన్యులు కూడా స్పందిస్తున్నారు. ఎవరికి తోచిన సాయం వారు ప్రకటిస్తున్నారు. తాజాగా.. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. జీఎంఆర్ గ్రూప్ రూ. 2.50 కోట్లు, కెమిలాయిడ్స్‌ కంపెనీ రూ.కోటి, శ్రీచైతన్య విద్యాసంస్థలు రూ.కోటి, అపోలో హాస్పిటల్స్‌ జేఎండీ సంగీత రూ.కోటి విరాళంగా అందించారు. కాగా ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రూ.కోటి, ప్రభాస్ రూ.కోటి, జూనియర్ ఎన్టీఆర్ రూ.50 లక్షలు, రామ్ చరణ్ రూ.50 లక్షలు, అల్లు అర్జున్ రూ.50 లక్షలు, మహేశ్ బాబు రూ.50 లక్షలు, చిరంజీవి రూ.50 లక్షలు, బాలకృష్ణ రూ.50 లక్షలు, అక్కినేని నాగార్జున రూ.50 లక్షలు, ఇంకా సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, అలీ, సోనూ సూద్, అనన్య నాగళ్ల, త్రివిక్రమ్, నిర్మాతలు సైతం తెలంగాణకు భారీ విరాళాలను ప్రకటించారు.


Similar News