BREAKING: మోడీ మీద కొట్లాడతామన్న సన్నాసులు ఏమయ్యారు: సీఎం రేవంత్‌రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

ఆనాడు ప్రధాని నరేంద్ర మోడీ మీద కొట్లాడతానన్న సన్నాసులు నేడు ఏమయ్యారంటూ సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్‌ప సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Update: 2024-08-22 09:28 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: ఆనాడు ప్రధాని నరేంద్ర మోడీ మీద కొట్లాడతానన్న సన్నాసులు నేడు ఏమయ్యారంటూ సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్‌ప సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణల నేపథ్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు ఇవాళ ఈడీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సంపదను కార్పొరేట్లు ఎలా దోచుకుంటున్నారో హిండెన్‌బర్గ్ సంస్థ సహాసోపేతంగా బయట పెట్టిందని పేర్కొన్నారు.

అదే అంశంపై ఇప్పటికే పార్లమెంట్‌లో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని గుర్తు చేశారు. అదానీ, అంబానీతో సహా మోడీ తన పరివారాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా జేపీసీ వేయాలంటూ పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తే మోడీ తప్పించుకు తిరిగారని.. ప్లాన్ ప్రకారం నాలుగు రోజులు ముందుగానే పార్లమెంట్‌ను వాయిదా వేశారని మండిపడ్డారు. దేశ సంపదను అప్పనంగా దోచుకున్న వారిని పక్కాగా జైలుకు పంపే వరకు పోరాడతమని అన్నారు. మోడీ ప్రధాని అయ్యే నాటికి దేశం అప్పు రూ.55 లక్షల కోట్లని.. నేడు అదే అప్పును రూ.1.55 లక్షల కోట్లకు చేర్చి దేశాన్ని అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు.

ఆనాడు మహా నాయకురాలు ఇందిరా గాంధీ బ్యాంకులను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. నిరుపేదలకు భూములను పంచిన ఘటన కేవలం ఇందిరకే దక్కిందని అన్నారు. దేశంలో ఐటీ రంగానికి పునాది వేసిందే రాజీవ్ గాంధీయేనని గుర్తు చేశారు. పీవీ నరసింహా రావు లాంటి మహా నాయకులు అత్యుత్తమ సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని పేర్కొన్నారు. దేశానికి బీజేపీ ముప్పుగా పరిణమించిందని, ప్రజల సంపద ఎలా దోపిడీకి గురైందో అందరికీ తెలియాలని అన్నారు.

ప్రధాని మోడీపై కొట్లాడతామన్న సన్నాసులు ఏమయ్యారని బీఆర్ఎస్‌ను ఉద్దేశించి ఆయన ఫైర్ అయ్యారు. హిండె‌న్‌బర్గ్ అంశంలో బీఆర్ఎస్ విధానం ఏంటో చెప్పాలన్నారు. బీజేపీని సంతోష పెట్టేందుకే శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు రాజీవ్ పేరు తొలగిస్తామంటున్నారని ధ్వజమెత్తారు. ఒకవేళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టకుంటే వీపు చింతపండు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగం ఊడిన తరువాత వీళ్లకు తెలంగాణ తల్లిపై ప్రేమ పుట్టుకొచ్చిందని కామెంట్ చేశారు. ఇక హిండెన్‌డబర్గ్ అంశంపై పార్లమెంట్‌లో జేపీసీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.        

Tags:    

Similar News