బ్రేకింగ్: ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన టిప్పర్.. 40 మందికి గాయాలు

ఆర్టీసీ బస్సును టిప్పర్ బలంగా ఢీకొంది.

Update: 2023-04-30 03:05 GMT

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రుద్రంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలం నుండి గుంటూరు వైపుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న సింగరేణి రెస్క్యూ సిబ్బంది గాయపడిన ప్రయాణికులను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన భద్రాచలం డిపో సంబంధించిన బస్సులో సుమారు 45 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News