BREAKING: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. EAPCET (ఎంసెట్) ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో మార్పు

లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.

Update: 2024-03-22 11:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు EAPCET (అగ్రి అండ్ ఫార్మీ) పరీక్షను మే 7,8 తేదీల్లో, అదేవిధంగా EAPCET (ఇంజనీరింగ్) ఎంట్రన్స్ పరీక్షను మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక ICET పరీక్షను జూన్ 5, 6 తేదీకి మార్చుతున్నట్లు ఉన్నత విద్యా శాఖ చైర్మన్ లింబాద్రి ఉత్తర్వులు జారీ చేశారు.    




 


Tags:    

Similar News