నాడు కేసీఆర్.. నేడు రేవంత్ రెడ్డి.. తెలంగాణ బీజేపీ విమర్శలు

కేసీఆర్, రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ విమర్శలు గుప్పించింది.

Update: 2024-06-27 06:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ముగిసినా రాజకీయ వేడి ఇంకా తగ్గడం లేదు. జాయినింగ్ పాలిటిక్స్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాన్ని మరింత హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరిపోగా ఇంకెవరెవరూ పార్టీ మారబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తెలంగాణ బీజేపీ రియాక్ట్ అయింది. అధికార దాహంతో ఫిరాయింపులను ప్రోత్సహించడంలో నాడు బీఆర్ఎస్ అవలంబించిన విధానాన్నే నేడు కాంగ్రెస్ అనుసరిస్తోందని దుయ్యబట్టింది. ఈ రెండు పార్టీలు దొందు దొందే అని సెటైర్లు సెటైర్ వేసింది. ఫిరాయింపు చట్టానికి నాడు కేసీఆర్ తూట్లు పొడిస్తే నేడు రేవంత్ రెడ్డి సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారని ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా విమర్శించింది.

Tags:    

Similar News