కేటీఆర్.. ఓపిక పట్టండి
మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్కు బీజేపీ సోషల్ మీడియా గట్టి కౌంటర్ ఇచ్చింది. ప్రధాని మోడీ ఆర్ఆర్ ట్యాక్స్పై విమర్శలు చేసి దాదాపు 4 నెలలు దాటిందని ఎక్స్ లో కేటీఆర్ పోస్ట్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్కు బీజేపీ సోషల్ మీడియా గట్టి కౌంటర్ ఇచ్చింది. ప్రధాని మోడీ ఆర్ఆర్ ట్యాక్స్పై విమర్శలు చేసి దాదాపు 4 నెలలు దాటిందని ఎక్స్ లో కేటీఆర్ పోస్ట్ చేశారు. కాగా బీజేపీ సోషల్ మీడియా.. కేటీఆర్.. కాస్త ఓపిక పట్టాలని ఘాటు రిప్లై ఇచ్చింది. మోడీ ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం సహించదని పేర్కొంది. ఈ విషయం కేటీఆర్కు బాగా తెలుసని భావిస్తున్నట్లు చురకలంటించింది. అవినీతి విషయంలో మోడీ ప్రభుత్వం ఎలా ఉంటుందనేది కేటీఆర్.. మరిచిపోతే తన చెల్లిని అడిగి గుర్తు తెచ్చుకోవాలని సెటైర్లు వేశారు. అయితే అవినీతిపరులు ప్రస్తుతం సీఎం కుర్చీలో కూర్చోవచ్చని, వారు దీని నుంచి బయటపడేందుకు బెయిల్ను ముందస్తుగానే తెచ్చే ప్రయత్నం కూడా చేసుకుని కంఫర్ట్గా ఫీలయ్యే అవకాశం కూడా ఉండొచ్చని బీజేపీ సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు. కానీ అలాంటి వారికి ఏదో ఒకరోజు శిక్ష తప్పదని, జైలుకు వెళ్లాక వారి గదులను అలంకరించుకునేందుకు వారికి చాలా సమయం ఉంటుందని చురకలంటించింది.