Bhatti vikramarka: గురుకులాల స్థల సేకరణపై భట్టి సమీక్ష

గురుకుల పాఠశాలల స్థల సేకరణ,డిజైన్స్ త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.

Update: 2024-08-19 12:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గురుకుల పాఠశాలల స్థల సేకరణ, డిజైన్స్ త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ లో గురుకుల విద్యా సంస్థలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.5 వేల కోట్లతో 30 ప్రదేశాల్లో 120 గురుకుల పాఠశాలల నిర్మాణం చేపట్టబోతున్నామని విద్యార్థులకు వసతుల కల్పనపై ఈ నెల 29 లోగా చెక్ లిస్టు తయారు చేయాలని ఆదేశించారు.

Tags:    

Similar News