ప్రక్షాళన చేసి పరీక్ష.. డీఎస్సీ ఫలితాలపై డిప్యూటీ సీఎం ఆసక్తికర పోస్ట్

ఇవాళ విడుదలైన డీఎస్సీ ఫలితాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ అభ్యర్ధులకు అభినందనలు తెలియజేశారు.

Update: 2024-09-30 11:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇవాళ విడుదలైన డీఎస్సీ ఫలితాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ అభ్యర్ధులకు అభినందనలు తెలియజేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన.. "తెలంగాణ డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల చేయడం ఆనందంగా ఉంది" అంటూ సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన పోస్ట్ పై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రక్షాళన చేయడమే గాక పారదర్శకంగా పరీక్ష నిర్వహించి, ఫలితాలు విడుదల చేశామని తెలిపారు. అలాగే మెగా డీఎస్సీ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. ఇక స్వరాష్ట్ర కాంక్షల ప్రజాభిప్రాయం మేరకే ప్రజా ప్రభుత్వం - ప్రజా పాలన కొనసాగుతాయని భట్టి స్పష్టం చేశారు. కాగా సోమవారం బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ-2024 ఫలితాలతో పాటు ఎంపికైన అభ్యర్ధుల ర్యాంకింగ్ లిస్టును విడుదల చేశారు.

Tags:    

Similar News