మళ్లీ తెరపైకి అయేషా మీరా హత్య కేసు.. వార్డెన్‌ను విచారించిన CBI

ఉమ్మడి ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

Update: 2023-05-04 05:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ హైదరాబాద్ సీబీఐ చేపట్టగా గతంలో సత్యం బాబను నిర్దోషిగా కోర్టు తేల్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అయేషా తల్లిదండ్రులు కోర్టుని ఆశ్రయించారు. కోర్టు సీబీఐకి విచారణ చేపట్టాలని ఆదేశించగా తాజాగా మళ్లీ సీబీఐ విచారణ ప్రారంభించింది. విచారణలో భాగంగా హాస్టల్ వార్డెన్‌ను సీబీఐ విచారించింది. 2007లో ఈ ఘటన జరగగా అసలు నిందితులను ఇప్పటి వరకు గుర్తించకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

Tags:    

Similar News