స్కూళ్లో దారుణం.. విద్యార్థుల నోట్లో గుడ్డలు కుక్కి.. బూట్లతో అనుమానం

మెదక్ జిల్లా తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు తొమ్మిదో తరగతి విద్యార్థులను అదే పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టారు.

Update: 2024-09-02 13:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లా తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు తొమ్మిదో తరగతి విద్యార్థులను అదే పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టారు. నోట్లో గుడ్డలు కుక్కి.. బూట్లు, రాళ్లతో ఒకేసారి పదిమంది విద్యార్థులు దాడి చేశారు. ఈ దాడిలో ఆ ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని దాడి చేసిన పది మంది విద్యా్ర్థులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News