తెలుగు రాష్ట్రాలకు అపోలో గ్రూపు వరద సాయం

తెలుగు రాష్ట్రాలకు అపోలో గ్రూపు వరద సాయం ప్రకటించింది. ఒక్కో రాష్ట్రానికి కోటి చొప్పున రెండు కోట్లు ప్రకటించింది.

Update: 2024-09-06 14:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలకు అపోలో గ్రూపు వరద సాయం ప్రకటించింది. ఒక్కో రాష్ట్రానికి కోటి చొప్పున రెండు కోట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం అపోలో గ్రూపు చైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రకటన విడుదల చేసింది. కాగా, ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రస్థాయిలో నష్టం చవిచూసిన తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం సైతం స్పందించింది. ఏపీ, తెలంగాణలకు రూ.3,300 కోట్ల వరద సాయం ప్రకటించింది. రెండు రాష్ట్రాలో భారీగా వరద నష్టం జరిగిన నేపథ్యంలో, ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సిన చర్యల కోసం ఈ నిధులు విడుదల చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఓవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తుండగానే, కేంద్రం ఈ తక్షణ సాయం ప్రకటించింది.


Similar News