హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్ షా.. స్వాగతం పలికిన కిషన్ రెడ్డి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సహా పార్టీ ముఖ్య నేతలు స్వాగతం పలికారు.

Update: 2023-03-11 17:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సహా పార్టీ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. ఈ రాత్రికి ఎన్ఐఎస్ఏలో బస చేయనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ నేతలతో భేటీ కానున్నారు. ఆదివారం(మార్చి 12) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండలం హకీంపేటలోని జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీలో ఉదయం 11 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో షా పాల్గొననున్నారు. అమిత్ షా సమక్షంలో బలగాలు వివిధ ప్రదర్శనలు చేయనున్నాయని సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. అనంతరం సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌లో అమిత్ షా పాల్గొననున్నారు. అనంతరం నేరుగా ప్రత్యేక విమానంలో కేరళలోని కొచ్చికి వెళ్లనున్నారు.

Tags:    

Similar News