సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు.

Update: 2024-09-01 16:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై, వరదలపై ఆరా తీశారు. కాగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వర్షాలు, వరదల గురించి క్షేత్రస్థాయి వివరాలను, జరిగిన నష్టాన్ని అమిత్ షాకు రేవంత్ రెడ్డి వివరించారు. ఇప్పటి వరకు ప్రాణనష్టం పెద్దగా జరగలేదని, ఇక ముందు కూడా ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన తక్షణ సహాయాన్ని అందిస్తామని, కేంద్ర ప్రభుత్వం తరుపున కావాల్సిన వరద సహాయక చర్యలకు ప్రత్యేక బృందాలను పంపిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి అవసరమైతే ప్రత్యేక హెలికాప్టర్లను కూడా పంపిస్తామని అమిత్ షా తెలియజేసినట్టు సమాచారం.  


Similar News