ఒకే వేదికపై ప్రొఫెసర్ కోదండరామ్- కేటీఆర్.. ఆ సభలో ఆసక్తికర సన్నివేశం

తెలంగాణ జన సమితి పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ కోదండరామ్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపై కనిపించారు.

Update: 2024-09-21 08:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జన సమితి పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ కోదండరామ్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపై కనిపించారు. ఈ ఆసక్తికర సన్నివేశం రవీంద్రభారతి వేదికగా చోటుచేసుకుంది. శనివారం ఉదయం 11 గంటలకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సంస్మరణ సభలో ఈ దృశ్యం కనిపించింది. సభలో కేటీఆర్ ప్రసంగించిన అనంతరం కేటీఆర్ ప్రొఫెసర్ పక్కన కూర్చున్నారు. ఈ క్రమంలోనే కోదండరామ్ కేటీఆర్‌ను పలకరించారు. వెంటనే కేటీఆర్ సైతం ఆయన్ను పలకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా, ఇటీవల సీతారాం ఏచూరి 12వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన సంస్మరణ కార్యక్రమం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్ని పార్టీల ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే వేదికపై కనబడుతారని ఇరు పార్టీల శ్రేణులు అందరూ ఉత్కంఠతతో ఎదురుచూశారు. కానీ ముందుగా వచ్చిన కేటీఆర్ ప్రసంగం అనంతరం వెళ్లిపోయారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రావడంతో ఉత్కంఠతకు తెరపడింది. అయితే ఈ సన్నివేశం కాకుండా కోదండరామ్‌తో కేటీఆర్ వేదికపై కనిపించడం ఆసక్తిగా మారింది.


Similar News