ముధోల్ అభివృద్ధికి కృషి

నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.

Update: 2024-10-17 10:06 GMT

దిశ, ముధోల్ : నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆయన క్యాపు కార్యాలయంలో గురువారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో 2500 కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్టు తెలిపారు.

    ఆడపిల్ల పెళ్లి చేసిన కుటుంబాలకు ప్రభుత్వ సహాయం సకాలంలో అందించినట్టు చెప్పారు. ముధోల్ లో పాలిటెక్నిక్ కళాశాల, ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్ర ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రూ.30 కోట్లతో ముధోల్ నుండి పంచగుడి వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులను ఇటీవల ప్రారంభించినట్టు తెలిపారు. ప్రజాసేవే తన లక్ష్యం అన్నారు‌. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ నారాయణ పటేల్, బీజేపీ మండల అధ్యక్షులు కోరి పోతన్న, నాయకులు నర్సాగౌడ్, , మోహన్ రెడ్డి, తాటివర్ రమెష్, సప్పటోళ్ల పోతన్న, కదం సంతోష్, దత్తాద్రి, లక్ష్మీనారాయణ, బత్తినోడు సాయినాథ్ పాల్గొన్నారు. 

Tags:    

Similar News