మద్యం మత్తులో వీరంగం.. విసుగు చెందిన ప్రయాణికులు..

మద్యం మత్తులో బస్సును వెళ్లనీయకుండా నడిరోడ్డుపైనే

Update: 2024-09-16 14:49 GMT

దిశ,భైంసా: మద్యం మత్తులో బస్సును వెళ్లనీయకుండా నడిరోడ్డుపైనే కొద్దిసేపు పడుకొని ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. సోమవారం బైంసా పట్టణంలో వారాంతపు సంత కావడంతో జనాలు పక్క రాష్ట్రం మహారాష్ట్ర నుంచి సైతం వస్తుంటారు. అయితే ఫుల్ గా నిండి ఉన్న మహారాష్ట్ర లోని పాలజ్ గ్రామానికి వెళ్తున్న బస్సు కి అడ్డంగా గాంధీ గంజ్ ఎదుట గల రోడ్డుపై ఓ వ్యక్తి పడుకొని బస్సును వెళ్లనీయకుండా కొద్దిసేపు రోడ్డుపైనే పడుకున్నాడు. బస్సులో కిక్కిరిసి పోయేలా ఉన్న జనాలు వీడెవడండీ బాబు..! ఎంతకి జరగడం లేదంటూ విసుగు చెంది, అలానే కొద్దిసేపు వేచి చూశారు.రోడ్డుపై వెళ్తున్న కొందరు అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని లేపి బస్సు పంపించారు.


Similar News