చెన్నూరులో టెన్షన్.. టెన్షన్.. గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో ఇరువర్గాల ఘర్షణ

మంచిర్యాల జిల్లా చెన్నూరు కొత్తగూడెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది....

Update: 2024-09-16 03:41 GMT

దిశ, వెబ్ డెస్క్: మంచిర్యాల జిల్లా చెన్నూరు కొత్తగూడెం (Chennuru Kothagudem)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గణేశ్ నిమజ్జనం (Ganesh Immersion)సందర్భంగా యువకుడు హల్ చల్ చేశారు. చంపేస్తానంటూ కత్తితో బెదిరింపులకు దిగారు. దీంతో ఆ యువకుడిపై మరో వర్గం దాడి చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. కొత్తగూడెం ప్రాంతంలో అడుగుగడునా సీసీ కెమెరాలు ఉన్నాయని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.  చెరువులు, కాలువలు, కుంటల్లో  వినాయక నిమజ్జనాలకు అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలని చెప్పారు.వినాయక విగ్రహాలను తీసుకెళ్లే సమయంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఊరేగింపులో బాణా సంచా కాల్చకూడదని చెప్పారు. రహదారుల్లో కిందకు వేలాడుతున్న కరెంట్ వైర్లతో ప్రమాదం ఉంటుందని, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.


Similar News