గ్రామాల అభివృద్ధికి రహదారులే ప్రధానం

గ్రామాల అభివృద్ధికి రహదారులే ప్రధానమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.

Update: 2024-10-19 13:00 GMT

దిశ, కుబీర్ : గ్రామాల అభివృద్ధికి రహదారులే ప్రధానమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శనివారం మండల కేంద్రం నుంచి తొట్టంబ వరకు బీటీ రోడ్డు పనులకు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మహారాష్ట్ర సరిహద్దు రహదారి కావడంతో రోడ్డు పనులు త్వరగా పూర్తయితే వ్యాపారాలు పెరుగుతాయన్నారు.

    అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వసంత రమేష్, మాజీ ఎంపీపీ వడ్నం జ్యోతి నాగేష్, నాయకులు రాథోడ్ గులాబ్, సాయినాథ్, గంగా శేఖర్, నాగేందర్, వెంకట్రావు పటేల్, బీజేపీ మండల అధ్యక్షుడు యేశాల దత్తాత్రి, పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News