గిరిజన దండోరా దర్బార్ పోస్టర్ ఆవిష్కరణ..

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో గిరిజన దండోరా దర్బార్ పోస్టర్ ను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆవిష్కరించారు.

Update: 2024-10-19 08:06 GMT

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో గిరిజన దండోరా దర్బార్ పోస్టర్ ను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆవిష్కరించారు. శనివారం కాసిపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వినోద్, జిల్లా కలెక్టర్ కుమార దీపక్ పాల్గొన్నారు. ఈ నెల 27 న తలపెట్టనున్న గిరిజన దండోరా దర్బార్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్, జిల్లా స్థాయి ఆదివాసీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల, నియోజకవర్గ నాయకులు నిర్వాహకులు పాల్గొన్నారు.


Similar News