ఈవీఎం గోదాంలను తనిఖీ చేసిన కలెక్టర్..

ప్రతినెలా తనిఖీలలో భాగంగా శనివారం స్థానిక శాంతినగర్ లోని ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, పలువురు ప్రధాన పార్టీల నాయకులతో కలిసి పరిశీలించారు.

Update: 2024-10-19 09:40 GMT

దిశ, ఆదిలాబాద్ : ప్రతినెలా తనిఖీలలో భాగంగా శనివారం స్థానిక శాంతినగర్ లోని ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, పలువురు ప్రధాన పార్టీల నాయకులతో కలిసి పరిశీలించారు. గోదాములలో ఈవీఎంలు సరిగా ఉన్నాయా లేదా ఏదైనా సమస్యలు తలెత్తాయా అన్న కోణంలో తనిఖీ చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఈవీఎం గోదాముల వద్ద ఉన్న భద్రతా సిబ్బందితో మాట్లాడి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని, షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు సంభవించకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ శ్యామల దేవి, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు ఉన్నారు.


Similar News